YS Jagan to Reach 2000 KM Milestone | 2వేల కిలోమీటర్లు పూర్తి చేసిన జగన్ పాదయాత్ర | hmtv |
|
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ఇవాళ మరో మైలురాయిని చేరుకోనుంది. గతేడాది నవంబర్ ఆరున... కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర... రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పూర్తిచేసుకొని.... పశ్చిమగోదావరిలోకి ప్రవేశించింది. ఇక ఈరోజు ఏలూరు సమీపంలోని మాదేపల్లి దగ్గర జగన్ పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. ఈ సందర్భంగా అక్కడ 40 అడుగుల పైలాన్ను వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. అలాగే సాయంత్రం ఏలూరు పాత బస్టాంట్ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో 13 నియోజకవర్గాల మీదుగా దాదాపు 250 కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర సాగనుంది. ఇక జగన్ పాదయాత్రపై పశ్చిమ వైసీపీ నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకపోవడంతో.... జగన్ పాదయాత్రతోనైనా జిల్లాలో పార్టీ పుంజుకుంటుందని ఆశిస్తున్నారు.
#ysjagan #ysrcp #prajasankalpayatra #jaganpadayatra Pawan Kalyan To Visits Settipalli : https://goo.gl/xR7p4Y తెలుగు రాష్ట్రాలపై పగబట్టిన పిడుగులు : https://goo.gl/H2ueXf Thunderstorm, squall likely in North India : https://goo.gl/H8oGAf IMD issues fresh warning of thunderstorms : https://goo.gl/jnCFuP Watch HMTV Live ► https://youtu.be/U3x_DkL0SNY ► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E ► Like us on FB : https://www.facebook.com/hmtvnewslive ► Follow us on Twitter : https://twitter.com/hmtvlive ► Follow us on Google+ : https://goo.gl/FNBJo5 ► Visit Us : http://www.hmtvlive.com/ ► Visit : http://www.thehansindia.com |